కార్యక్షేత్రంలోకి కెసిఆర్‌ 

తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ఘనవిజయం తరవాత ఇప్పుడు ఎక్కడ చూసినా కెసిఆర్‌ పథకాలపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ఆయన చేపట్టిన పథకాలే గెలిపించాయన్న భావన ప్రతి ఒక్కరిలో బలపడుతోంది.
నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్న సంకల్పం తీసుకున్న చర్యలు అన్నీ సాకారం అయ్యే దిశగా సాగుతోంది. రైతన్నలను ఏ విధంగా ఆదుకోవచ్చో ప్రపంచానికి  తెలిపేలా చేస్తున్న కార్యక్రమాలు  తెలంగాణ చరిత్రను కొత్తగా లిఖించబోతున్నది. ఎన్నికల్లో విజయం తరవాత కెసిఆర్‌ ఇప్పుడు తాను చేపట్టిన పథకాలను వేగంగా ముందుకు తీసుకుని వెళ్లడమే లక్ష్యంగా కార్యక్షేత్రంలోకి  దిగారు. నిరంతరం సవిూక్షలు చేస్తూ అధికారులను పురమాయిస్తున్నారు. పార్టీ వ్యవహారాలను కెటిఆర్‌కు అప్పగించడంతో ఇప్పడు ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగే అవకాశం వచ్చింది. కొందరు కారణ జన్ములు ఉంటారు. ప్రజలకోసం నిరంతరం తపించే పాలకులు ఉంటారు. మనం పాలన చేసేది వారికోసమే అని అనుకుంటారు. అందుకు అనుగుణంగా ఆలోచన చేస్తారు. తమ ఆలోచనలు కార్యారూపం దాల్చేలా చేస్తారు. తెలంగాణ కల సాకారం అవుతుందని ఎవరు కూడా ఊహించలేదు. కెసిఆర్‌ తన ఆలోచనలనకు పదనుపెట్టి ముందుకు నడిచి దానిని సాకారాం చేసిన క్రమంలో తెలంగాణ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్దికి బాటలు వేస్తున్న తరుణంలో రైతుబంధు పథకం చేపట్టి విడదీయరాని బంధాన్ని పెనవేసుకున్నారు. కాయకష్టం చేసి కనీస మద్దతు ధరకోసం ఎదురు చూస్తున్న రైతులకు పెట్టుబడి సాయం ఎంతోకొంత అందితే అంతకన్నా కావాల్సిందేముంది. ఇప్పుడదే జరుగుతోంది. రైతును వెన్నుతట్టి ముందుకు నడిపించే మహానాయకుడొకడు తెలంగాణలో కెసిఆర్‌ రూపంలో వచ్చాడన్న ధీమాలో రైతాంగం ఉంది. కాళేశ్వరం లాంటి పథకం పూర్తయి, కోటి ఎకరాలకు సాగునీరు అందితే ఇక తెలంగాణ స్వరూపం మారనుంది. ప్రధానంగా గ్రావిూణ ఆర్థిక రంగం కొత్తరూపం సంతరించుకోనుంది. ఇప్పటికే మిషన్‌ కాతీయతో చెరువుల పునరుద్దరణ అన్న మహాయజ్ఞం నడుస్తోంది. దీంతో ఎప్పుడూ లేని విధంగా వేలది చెరువులు మళ్లీ జలకళ సంతరించుకున్నాయి. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ తాగునీరు రాబోతున్నది. ఇకపోతే నిరంతర విద్యుత్‌తో అటు ప్రజలను, ఇటు రైతులను ఆశ్చార్యానికి గురి చేశారు. అలాగే ప్రాజెక్టులను శరవేగంగా నడిపిస్తూ కృష్ణా,గోదావరి నదులను తెలంగాణ భూములకు చేరేలా చేస్తున్నారు. ఈ దశలో రైతులకు అండగా వారి వ్యవసాయంలో సాయం చేసే పథకం ఆవిష్కృతం కాబోతున్నది. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా చూడాలన్న కల సాకారం దిశగా ఈ నాలుగేండ్లలో సీఎం కేసీఆర్‌ అనేక చర్యలు తీసుకుంటూ ముందుకుసాగుతున్న తీరు అందరినీ అధ్యయనం చేసేలా చేస్తోంది.  జనాభాలో 70శాతం ఉన్న రైతన్నల కష్టాలు తెలిసిన నాయకుడిగా నాలుగున్నరేళ్లుగా చేస్తున్న ఆలోచనలు, కార్యక్రమాలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్న వేళ తెలంగాణలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ప్రజలంతా మళ్లీ తమ నాయకుడు కెసిఆర్‌ అని నిరూపించారు. తొలుత మిషన్‌ కాకతీయ పథకంతో చెరువుల్లో పూడిక తీయించి భూగర్భజలాల స్థిరీకరణపై దృష్టిపెట్టారు. ఇప్పటికే సుమారు 19వేల చెరువుల పునరుద్ధరణ పూర్తయింది. బోర్లకింద ఎక్కువ సాగు భూమి ఉన్నందున రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందిస్తున్నారు. సకాలంలో ఎరువులు,విత్తనాలు అందుబాటు లో ఉంచుతున్నారు. యాంత్రీకరణకు పెద్దపీట వేస్తూ ఆధునిక వ్యవసాయం వైపు వారిని మళ్లించారు. రైతులకు సాంకేతిక అంశాల్లో అండగా ఉండేలా ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించారు. గోదాంల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టారు. రైతు సమస్యలు ఒక్కొక్కటి గా పరిష్కరిస్తూ వచ్చిన సీఎం కేసీఆర్‌.. దేశ వ్యవసాయరంగ చరిత్రలోనే పెను సంచలనమైన రైతుబంధు పథకాన్ని ప్రకటించారు.
సాగుపెట్టుబడి కోసం రైతుకు నేరుగా ఎకరానికి రూ.4వేలు ఇస్తామని ప్రకటించగానే యావత్‌ దేశం దృష్టి ఇటువైపు మళ్ళింది. దేశ రైతాంగం సంబురపడిపోతే.. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదెలా సాధ్యమంటూ తెలంగాణవైపు దృష్టి సారించారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు పలు కీలక నిర్ణయాలు ఇప్పుడు ఇతరులకు ఆదర్శం కాబోతున్నాయి. రైతులే తమ పంటకు సరైన ధరను నిర్ణయించుకునేలా గ్రామ రైతుసంఘాల కలయికతో మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో రైతు సమాఖ్యల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టి రైతులకు భవిష్యత్‌పై భరోసా కల్పించింది. ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు రైతును ఆదుకునేలా రాష్ట్ర రైతు సమాఖ్యకు బడ్జెట్‌ కేటాయించింది. వ్యవసాయ బడ్జెట్‌ కేటాయింపుల్లో వ్యవసాయ యాంత్రీ కరణకు నిధులను ఏటా పెంచుతూ వస్తున్నారు. అడ్డగోలు ఎరువుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు రైతు పొలానికి ఏ పోషకాలు ఎంత అవసరమో తెలియజేసే అత్యంత ముఖ్యమైన భూసార పరీక్ష కార్డుల పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. భూసార పరీక్షలు చేయించి రైతులకు భూసార పరీక్ష ఫలితాల కార్డులను అందజేసే కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ దశలో రైతుకు ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన వినూత్న, విప్లవాత్మక పథకం రైతుబంధు ఇప్పుడు విజయవంతంగా అమలు చేసి చూపారు. రాష్ట్ర వ్యవసాయరంగంలో స్వర్ణయుగానికి బాటలు వేస్తూ..  ముఖ్యమంత్రి  కెసిఆర్‌ తీసుకుంటున్న చర్యలు ఒక్కొక్కటే కార్యరూపం దాల్చబోతున్నాయి. కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే  తెలంగాణ కొత్త చరిత్రను లిఖించుకుంటోంది. ఇందుకు అనుగుణంగా మళ్లీ ప్రభుత్వంలోకి రాగానే వీటిపైనే కెసిఆర్‌ దృష్టి సారించారు. అందుకే ప్రాజెక్టుల పనులు కూడా పరుగు పెట్టనున్నాయి.