కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు

నల్గొండ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): చిట్యాల శివారులో పెద్ద ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బస్సు హైదరాబాద్‌ నుండి చిలకలూరిపేటకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తం అయి బస్సును బయలకు తీసారు.