కాళోజీ వర్సిటీ పరీక్షల్లో గందరగోళం

పరీక్ష రద్దు: తిరిగి 12న నిర్వహణ

వరంగల్‌,జనవరి28(జ‌నంసాక్షి): కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ఎంబీబీఎస్‌ పరీక్షల నిర్వహణలో గందరగోళం నెలకొంది. ఫార్మాకాలజీ రెండో ఏడాది మొదటి ప్రశ్నపత్రం విషయంలో వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను అయోమయంలో పడేసింది. ఒక్కో కేంద్రానికి వేర్వేరు సెట్లను పంపడంతో ఈ గందరగోళం నెలకొంది. దీంతో పరీక్ష ముగిశాక పరీక్షను రద్దు చేస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. రద్దయిన పరీక్ష ఫిబ్రవరి 12న ఉంటుందని పేర్కొంది. మిగతా పరీక్షల మాత్రం షెడ్యూల్‌ ప్రకారమే ఉంటాయని వర్సిటీ అధికారులు తెలిపారు.