కీసరలో మొక్కలు నాటిన ఎంపీ సంతోష్ కుమార్

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : గ్రీన్‌ ఛాలెంజ్‌ మూడవ విడత కార్యక్రమంలో భాగంగా నేడు శామీర్‌పేటలోని బిట్స్‌పిలానీ క్యాంపస్‌ ఆవరణలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌కుమార్‌తో పాటు మంత్రి మల్లారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఎమ్మెల్యే కే.పి.వివేకానంద, మాధవరం కృష్నారావు, కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.