కుక్కల స్వైర విహారం

ఆరుగురికి గాయాలు

మహాబుబ్‌నగర్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): జిల్లా లోని నారాయణపేట పట్టణంలో పిచ్చి కుక్కలు దాడి చేశాయి. 6 మందిపై దాడి చేసి కాటు వేయగా,ఒక చిన్నారి చెవిని పూర్తిగా కొరికేసాయి. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రెండు రోజుల్లో దాదాపు 15 మంది చిన్నారుల పై కుక్కలు దాడి చేశాయి. నారాయణపేట లోని గోపాలపెట్‌ విధి , హజీఖాన్‌ పెట్‌, పళ్ళ వీధి, ఇలా పలు వీధులలో మొత్తం చిన్నారులతో పాటు వృద్ధులను కూడా కుక్కలు కాటేశాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు ప్రవేటు ఆసుపత్రిలో మరికొందరు చికిత్స పొందుతున్నారు.