కుటుంబం ప్రాణం మీదికి తెచ్చిన ‘ర్యాగింగ్’

rvz0s8ltఆదిలాబాద్ : సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య గొడవ ఓ కుటుంబం ప్రాణం మీదికి తెచ్చింది. జిల్లాలోని శ్రీరాంపూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో సాయి భార్గవ అనే విద్యార్థి సెకండియర్ చదువుతున్నాడు. విద్యార్థుల మధ్య గొడవలో భార్గవ్ ప్రమేయముందని… తమను ర్యాగింగ్ పేరుతో వేధించాడంటూ… కొందరు స్టుడెంట్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ర్యాగింగ్ నేరంతో జీవితం నాశనమవుతుందని సాయి భార్గవ్ తో పాటు కుటుంబసభ్యులు ఆవేదన చెందారు. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం సెంటినరీ కాలనీలోని తమ ఇంట్లో అందరూ కలిసి హెయిర్ డై తాగారు. వీరిని స్థానికులు గోదావరిఖని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. అందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు