కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్య

రంగారెడ్డి,ఆగస్టు 17: కందుకూరు మం. తిమ్మాపూర్‌లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబకలహాలే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలుపుతున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించామని వారు తెలిపారు. పోస్టుమార్టుం నిమిత్తమై మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు