కుటుంబ కలహాలతో గృహిణి ఆత్మహత్య

మహబూబాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన పోలబోయిన రజిత అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే రజిత ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రజిత మృతితో ఆమె కుటుంబంలో పెనువిషాదం నెలకొంది. పోస్టుమార్టం కోసం రజిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.