కురవి ఆలయంలో పూజలు

మహబూబాబాద్‌,జూన్‌19(జ‌నం సాక్షి): రాహుల్‌ గాంధీ 48వ పుట్టినరోజును పురస్కరించుకుని రాహుల్‌ గాంధీ సేవాసమితి అధ్యక్షుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ కురవి దేవస్థానంలో రాహుల్‌ గాంధీ పేరున ప్రత్యేక పూజలు,అర్చన చేయించారు. రాహుల్‌ గాంధీ ఆయురారోగ్యాలతో,2019న ప్రధాని అయ్యి,తెలంగాణాలో మొత్తం సీట్లు కాంగ్రేస్‌ పార్టీ కైవసం చేసుకోవాలనే ఆకాంక్షించారు. కార్యక్రమంలో చీకటి కిరణ్‌,బీరం శ్రీపాల్‌ రెడ్డి,అశోక్‌,సాయికుమార్‌, రఫీ,సత్తయ్య, బొట్టు రమేష్‌ యువజన నాయకులు పాల్గొన్నారు.