కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర

సిద్దిపేట,జూలై24(జ‌నంసాక్షి): కూరగాయలు పండించే రైతులకు తగిన గిట్టుబాటు దర కల్పించేందుకుగాను కార్యాచణ ప్రణాళికను రూపొందించాలని ఉద్యాన అధికారులను ఆదేశించారు. అవసం మేరకు పంటలను పండించాలని, సేంద్రియ పద్దతుల పాటించాలని ఉద్యానశాఖ అధికారులకు సూచించారు. టమాటాలు ధర ఉన్నప్పుడు పండించి లాభాలు పొందేలా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. యుఎస్‌డీపి, ఎఎస్‌ఐ సంస్థల సహకారంతో రైతుల ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ఇందుకోసం ప్రయోగాత్మకంగా కొన్ని ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లబించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, వర్గల్‌, సిద్దిపేట, మండలాల్లో కూరగాయలు పండించే రైతుల ఉత్పత్తులకు ఈ సంస్థ సహకారంతో అధిక ధర లబించేలా భాగస్వాములను చేయాలని నిర్ణయించామన్నారు. రైతులు పండించే కూరగాయలను గ్రేడింగ్‌ చేసి ప్యాకింగ్‌ చేసి మార్కెటింగ్‌ చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయం, హార్టికల్చర్‌ శాఖల అధికారులు కార్యాచరణను రూపొందించాలని సూచించారు. రైతులను ఈదిశగా ప్రోత్సాహం అందించేందుకుగాను తగిన శిక్షణ సూచనలు, సలహాలు అందించడం జరుగుతుందన్నారు. కూరగాయలు పండ్లు పూల సాగుచేసే రైతులు, సంబందిత అధికారులను భాగస్వామ్యం చేస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.