కృష్ణాపరివాహక ప్రాంతంలో తగ్గతుతున్న వరద


జూరాలకు క్రమంగా తగ్గుతున్న ప్రవాహం
శ్రీశైలంలోకి స్వల్పంగా కొనసాగుతున్న నీటిరాక
మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): కృష్ణాపరివాహక ప్రాంతంలో వరదప్రవాహం తగ్గింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతున్నది. ఎగువనుంచి నీటిరక తగ్గడంతో ప్రాజెక్టుల్లో గేట్లు మూసేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్‌కు ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. ఎగువన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి వచ్చే నీరకు కూడా తగ్గిపోయింది. జలాశయంలోకి ప్రస్తుతం 76,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఎత్తి 65,240 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 విూటర్లకుగాను 318.240 విూటర్ల వద్ద నీరు ఉన్నది. జూరాల గరిష్ఠ నీటి నిల్వ 9.657 టీఎంసీలు. ప్రస్తుతం 9.091 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. శ్రీశైలం జలాశయం ప్రాజెక్టుకు 1,47,634 క్యూసెక్కుల ఇన్‌ఎª`లో వస్తోంది. రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి ఔట్‌ప్లో 1,12,047 క్యూసెక్కులుగా ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగలకు గాను ప్రస్తుతం 884.80 అడుగులుంది. గరిష్ఠ స్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు.. 214.3637 టీఎంసీల నిల్వ ఉన్నది.కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ డ్యామ్‌కు ఇన్‌ఎª`లో, ఔట్‌ఎª`లో 1,14,458 క్యూసెక్కులుగా ఉన్నది. ఐదు క్రస్ట్‌ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాయశం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 598.70 అడుగులుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 311.14 టీఎంసీల మేర నీరు నిల్వ ఉన్నది.