కెసిఆర్‌కు జగ్గారెడ్డి శుభాకాంక్షలు

మంచి పాలన అందించాలని ఆకాంక్ష

హావిూలపై దృష్టి పెట్టాలని వినతి

అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శలు

హైదరాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యె జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాలన పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి, మంత్రులకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సిఎం కెసిఆర్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యె జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉండి మంచి పాలన అందిచాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఎన్నికల హావిూలు ఇంకా ఎందుకు నెరవేర్చలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రైతు రుణమాఫీ ఇప్పటి వరకు ఇవ్వలేదని, రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తానన్నారని, తెలంగాణ అవినీతి లేని రాష్ట్రంగా ఉందా? అని ప్రశ్నించారు. అక్ష్యరాస్యతలో తెలంగాణ దేశంలో 13వ స్థానంలో ఉండటం బాధాకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందన్నారు. హత్యలు ఆత్మహత్యలతో రాష్ట్రం మర్డర్ల రాష్ట్రంగా మారిందన్నారు. కాలేజిలకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క సొంత భవనం కూడా నిర్మించలేదని విమర్శించారు. గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని జగ్గారెడ్డి ప్రశ్నించారు.గురువారం గాంధీభవన్‌లో విూడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హావిూల అమలుపై ప్రశ్నించారు. 17 వేల కోట్ల మిగులు ఆదాయంతో దేశంలో హుందాగా ఉన్న తెలంగాణ, నేడు కేసీఆర్‌ అసమర్థ పాలన వల్ల 3 లక్షల కోట్ల అప్పులతో దివాళా రాష్ట్రంగా మారిపోయిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి, రుణమాఫీ, కొత్త ఉద్యోగాలు, పీఆర్సీ, రైతు బంధు, మద్దతు ధరలు, ధరల నియంత్రణలలో ఏవీ అమలు కాలేదు. అవినీతిలో 5వ స్థానం, విద్యలో 13వ స్థానంలో ఉండడం బాధాకరం. విద్యా, వైద్యం పరిస్థితి దారుణంగా ఉందన్నారు. హత్యలు,అత్యాచారాలు పెరిగిపోయాయి. రోడ్లపైన హత్యలు జరుగుతున్నాయి. మహిళల పట్ల ప్రభుత్వా నికి చిన్న చూపు ఉంది. శాంతి భద్రతల విఘాతంలో దేశంలో రెండోస్థానంలో ఉండడం ఆందోళన కలిగి స్తోంది. తెలంగాణ అంటే చెడ్డపేరు వచ్చేవిధంగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఇంకా రెవెన్యూ ప్రక్షాళన అంటూ ఇంకా 11లక్షల మంది రైతులకు పాసుబుక్కులు ఇవ్వలేదు. పంచాయితీలకు, మున్సి పాలిటీ లకు నిధులు లేవు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులు అడిగే పరిస్థితి లేదు. గతంలో ఎమ్మెల్యేకు ఏడాదికి మూడు కోట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఒక్క పైసా లేదు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? సంగారెడ్డి ప్రజలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. గతంలో సింగూరు, మంజీరా నీరు బయటకు వదలొద్దంటే హరీష్‌రావు వినలేదు. ఇప్పుడు సంగారెడ్డి ప్రజలు నీరులేక ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు. ఇచ్చిన హావిూలను ముఖ్యమంత్రికి గుర్తు చేస్తున్నానంటూ వివరించారు.