కెసిఆర్‌ ఆదేశాలే శిరోధార్యం అన్న శంకరమ్మ

హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ చెప్పినట్టుగానే తాను నడుచుకుంటానని తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అన్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని తెలిపారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని.. రెండు నెలలు విశ్రాంతి తీసుకోనున్నట్లు చెప్పారు. ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్‌ తనకు ఏదైనా నామినేటెడ్‌ పోస్టుగాని, ఎమ్మెల్సీ గాని ఇస్తానని హావిూ ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌ గెలుపునకు సహకరిస్తానని అన్నారు.