కెసిఆర్‌ పాలన నచ్చలేదు: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి


వరంగల్‌, మార్చి 6 (జనంసాక్షి):

సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు చేసిందేవిూ లేదని… ఉద్యమానికి కేంద్ర బిందువులుగా ఉన్న యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విసిలు, ఉద్యోగ నియామకాలను పక్కన పెట్టి వాటిని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. శనివారం హన్మకొండ ఎస్వీ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌, ఓవైసీ కుటుంబాలే బంగారు కుటుంబాల య్యాయని విమర్శించారు. ఎంఐఎం పార్టీతో చెట్టా పట్టాల్‌ వేసుకుని పాలన సాగిస్తున్నారన్నారు. దేశంలోనే సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని చెప్పారు.  ప్రపంచంలో సచివాలయం లేని రాష్ట్రం మన బంగారు తెలంగాణ అన్నారు.  ముఖ్యమంత్రి సొంత ప్రాంతా నికి ఇచ్చిన ప్రాధాన్యత ఇతర ప్రాంతాలకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. 2016లో రైల్వే ఓవరాలింగ్‌ పరిశ్రమను ఇచ్చాం.. కానీ 160ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతోనే ఆ ప్రాజెక్టు నిలిచిపోయింద న్నారు. బీబీనగర్‌లో మెడికల్‌ కాలేజీ ప్రారంభమైనా… ప్రభుత్వం భూములను ఇవ్వలేదని చెప్పారు. వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం వాటా 30కోట్ల రూపాయలు చెల్లించలేదు. 6వేల కోట్లతో రామగుండంలో ఎరువుల పరిశ్రమ తెచ్చాం.. దానిని త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఏ జిల్లాలోనూ ఒక్క సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించలేదు. బీజేపీకి పేరు వస్తుందని ఆయుస్మాన్‌ భారత్‌ పథకాన్ని ఇన్నాళ్లూ అడ్డుకుందని చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకానికి కేసీఆర్‌ తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ నాయకుల మాటలు నమ్మొద్దు.. వరంగల్‌లో డ్రబుల్‌ బెడ్‌రూం ఇల్లు నిర్మిస్తామన్నారు అవి ఎక్కడికి పోయాయి..? అని ప్రశ్నించారు. పేదలంటే కేసీఆర్‌కు చులకన అని కిషన్‌రెడ్డి చెప్పారు. ఉద్యమకారులు రోడ్లపై ఉంటే ఉద్యమ ద్రోహులు ప్రగతి భవన్‌లో ఉన్నారన్నారు. కేసీఆర్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించే అర్హత లేదని.. జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, భూమాఫియా కొనసాగుతోందని.. చర్యలు తీసుకోవడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణకు చాలా కీలకమన్నారు. దుబ్బాకలో ప్రజలు టీఆర్‌ఎస్‌ కంచుకోటను బద్దలు కొట్టార న్నారు. హైదరాబాద్‌లో బీజేపీ సత్తా చాటిందని చెప్పారు. ముఖ్యమంత్రి కు టుంబంపై తెలంగాణ సర్వత్రా వ్యతిరేకతతో ఉందన్నారు. మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, అది బీజేపీతోనే సాధ్యమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ పథకానికి టీఆర్‌ఎస్‌ తూట్లు పొడిచిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.  సీఎం కేసీఆర్‌ సొంత ప్రాంతానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇతర ప్రాంతాలకు ఇవ్వడం లేదని తప్పుబట్టారు. కేసీఆర్‌ పాలనలో ఒక్క టీచర్‌ నియమాలు చేపట్టారా.. చెప్పాలని నిలదీశారు. నిరుద్యోగులు నియమకాలను చేపట్టాలని ఆందోళనలు చేస్తే బలవంతంగా అణిచి వేస్తున్నారని కిషన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హన్మకొండ ఎస్వీ కన్వెన్షన్‌ హాల్‌ లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి హాజరయ్యారు.  జిల్లా అధ్యక్షులు రావు పద్మా, అధికార ప్రతినిధి రాకేష్‌ రెడ్డి,  మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, మందడి సత్యనారాయణ, వన్నాల శ్రీరాములు,  యెండెల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.