కెసిఆర్‌ హావిూతో ప్రజలకు భరోసా

కాళేశ్వరం నీటితో మారనున్న దశ: ఎమ్మెల్యే

సిద్దిపేట,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ పర్యటనతో రైతులు, ప్రజల్లో భరోసా పెరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఇప్పుడు ప్రజలంతా మనవారే అని చెప్పడం అభినందనీయమని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని, గోదావరిలో వృథాగా వెళ్లే జలాలను బీడు భూ ములకు మళ్లించాలనే సంకల్పం గొప్పదన్నారు. గజ్వెల్‌కు జనవారి కల్లా కళేశ్వరం నుంచి గంగ పారుతుందన్న ప్రకటన ఇక్కడి రైతాంగానికి తీపి కబురని అన్నారు. ఈ ప్రాజెక్టు భావితరాలకు మేలు చేయడమే గాకుండాఅన్నదాతలకు ఇక నీటి భరోసా ఇస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేయడంలో టీం వర్క్‌ చేశారని పేర్కొంది. ఒకరోజు ముందుగా బోడగూడెంలో మకాం వేసి ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని సవిూక్షించి, జిల్లా అధికారులందరితో అక్కడే సమావేశం నిర్వహించి ప్రజల సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారానికి కృషి చేయడాన్నిఅభినందించారు.రైతులకు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఘనత దేశంలో సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదని ఎమ్మెల్యే అన్నారు. రైతును రాజును చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.