కెసిఆర్ సభను విజయవంతం చేయండి

కమలాపూర్ నవంబర్ 18 (జనం సాక్షి)
ఈనెల 20న హుజరాబాద్ పట్టణంలో జరిగే కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కమలాపూర్ మండల పరిషత్ అధ్యక్షుడు ఎల్. లక్ష్మణరావు కోరారు.
ఆయన మండల కేంద్రంలో ఆదివారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 20న హుజరాబాద్ లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సభ ను మండలంలోని ప్రతి ఒక గ్రామం నుండి టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మహిళా కార్యకర్తలు. అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి నవీన్ కుమార్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాట్ల రమేష్   రాములు  అరవింద్  సాంబయ్య  సంపత్ శ్రీనివాస్ సదానందం రవీందర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు