కేంద్ర,రాష్ట్ర సంబంధాలను నిర్వచించాలి

గవర్నర్ల పాత్రతో పాటు కేంద్ర రాష్ట్ర సంబంధాలను కొత్తగా నిర్వచించుకోవాల్సిన అవసరం, ఆగత్యం ఏర్పడిరది. ఇటీవల గవర్నర్ల పాత్రపై తరచూ వివాదాలు చెలరేగుతున్నాయి. తెలంగాణలో తమిళసై తీరు, కేరళలో అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, బెంగాల్లో గవర్నర్‌..ఇలా విపక్ష పార్టీల పాలిత రాష్టాల్ల్రో వివాదాలు తలెత్తు తున్నాయి. నిజానికి కేంద్రం బాధ్యతలు,రాష్టాల్ర పరిమితులు, పన్నుల షేరింగ్‌ సహా అన్ని అంశాలను చర్చించాలి. దీనికితోడు ఇటీవల పంచాయితీలకు నేరుగా నిధులు ఇవ్వడాన్ని తెలంగాణ సిఎం కెసిఆర్‌ తప్పుపట్టారు. నీటి వాటాలు తేల్చడం లేదు. కృష్ణా,గోదావరి జలాల్లో వాటాల కోసం ఎపి, తెలంగాణల మధ్య వివాదాలు తీవ్రం అవుతున్నాయి. నీటి పంచాయితీ తెంపండని అన్నా కేంద్రం ప్రేక్షక పాత్ర వహిస్తోం ది. ఈ క్రమంలో రాజ్యాంగంలో ఉన్న నియమాలు అమలవుతున్నాయా లేదా అన్న చర్చ చేయాలి. కేంద్ర, రాష్టాల్ర మధ్య సంబంధాలు బెడిసి కొట్టడం వంటి కారాణల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధాని వచ్చినప్పుడు అధికారిక కార్యక్రమాల్లో కూడా సిఎంలు పాల్గొనకపోవడం అన్నది ధిక్కరణ కిందకు వస్తుంది. రాజకీయ విభేదాలు వేరు..అధికారిక కార్యక్రమాలు వేరన్న విషయం మరచి పోయి ప్రవర్తిస్తు న్నారు. గతంలో ఇక్రిశాట్‌ ఉత్సవాలకు ప్రధాని మోడీ హాజరుకాగా, సిఎం కెసిఆర్‌ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇలాంటి ఘటనలే బెంగాల్లోనూ ఉన్నాయి. వీటిపైనా నిర్వచించాలి. గతంలో నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో సమస్యలను ఏకరువు పెట్టినా అవి అమలు కావడం లేదు. సంధానకర్తగా ఉండాల్సిన నీతి ఆయోగ్‌ తన పరిమితి మేరకు పనిచేస్తుందా లేదా అన్నది కూడా ముఖ్యమే. నీతి ఆయోగ్‌ ప్రారంభించి సమయంలో కనిపించిన స్ఫూర్తి లోపించింది. నీతి ఆయోగ్‌ ఏర్పాటు దశలో ప్రదాని మోడీ ఆనాడు చేసిన ప్రకటనకు భిన్నంగా నీతి తప్పిన ఆయోగ్‌గా అవతరించింది. సహకార సమాఖ్య సూత్రాలకు అనుగుణంగా మొత్తం దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయా రాష్టాల్రకు తగిన గౌరవం ఇచ్చి వారిని కూడా ఇందులో భాగస్వాములను చేయాల్సి ఉంది. రాష్టాల్రను కలుపుకుని ముందుకు సాగాల్సిన కేంద్రం ఆ దిశగా పని చేయడం లేదు. మళ్లీ పాతపద్దతిలోనే సాగుతోంది. నీతి ఆయోగ్‌ లక్ష్యాలను విస్మరించారు. జిఎస్టీని సమర్థించిన ఆయా రాష్టాల్ర సిఎంలే ఇప్పుడు దాని బారి నుంచి రక్షించాలని కోరుకుంటున్నారు. వివిధ రంగాలపై అదిచూపిస్తున్న చెడు ప్రభావాన్ని విశ్లేషించు కోవాల్సిన కేంద్రప్రభుత్వం మొండిగా వ్యవహరి స్తోందే తప్ప ప్రజల కోణంలో ఆలోచించడం లేదు. బ్యాంకు ల్లో దాచుకున్న డబ్బును సొంత అవసరాలకు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడటాన్ని గ్రామాల్లో ఇప్పటికీ చూస్తున్నాం. నగదు ఉపసంహరణపై ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఇలాంటి వాటివల్ల ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఆహారధాన్యాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయినా ధరలు అందుబాటులో లేవు. ఇలా రాజకీయపార్టీలకు అధికారమే తప్ప ప్రజలు కనబడడం లేదు. ఎంపిలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, గవర్నర్‌ వ్యవస్థ ఇలా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి బదులు నానాటికి దిగజారు స్తున్నాయి. ప్రజల డబ్బు నీళ్లప్రాయంగా ఖర్చవుతోంది. రాజకీయాల్లో ఎదుటి పక్షాలను ఢీకొట్టేందుకు తమ తెలివి తేటలను ఉపయోగిస్తున్న పాలకులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో శ్రద్ద చూపడం లేదు. ఈ దశలో ఇలాంటి ప్రజాస్వామ్యం కొనసాగితే మరో 75 ఏళ్లయినా మన భారత్‌ రాత మారదు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవం పేరిట ఉత్సవాలు చేసుకుం టున్నాం. ఈ క్రమంలో 75 ఏళ్ల స్వాతంత్య్ర కాలంలో సాధించిన ప్రగతితో పాటు మనం ఎదుర్కొంటున్న సమస్యలపైనా చర్చించాల్సిన అవసరం ఉంది. రాజకీయ సంస్కరణలు రావాలి. పాలకుల తీరులో మార్పు రావాలి. ప్రజాధనం వృధా ఖర్చులకు కళ్లెం పడాలి. ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులను పాలకుల
విసలాలకు ఖర్చు చేసుకుంటున్నారు. ప్రత్యేక విమానాల్లో సొంత పనులకు వెళుతున్నారు. దానికి అధికార ముసుగేస్తున్నారు. ఈ క్రమంలో రాజ్యంగం ఏ మేరకు ఎంతవరకు అమలు సాధించామన్నది పాలకులుగా రాజకీయ పార్టీల నేతలు మననం చేసుకోవాలి. అందరికీ సమన్యాయం అందుతుందా అన్నది చూడాలి. నేలవిడిచి సాము చేసే విధంగా దేశీయంగా ఉత్పత్తులపై దృష్టి పెట్టి స్వయం సమృద్ది సాధించకుండా దావోస్‌ లాంటి వేదికలపై పెట్టుబడులకు వెంపర్లాడుతున్న విధానం పోవాలి. దేశీయంగా ఉన్న సాంకేతికత ను ఉపయోగించుకుని యువతను స్వయం సమృద్దికి సన్నద్దం చేయాలి. వ్యవసాయం, అనుబంధ రంగాలను అభివృద్ది చేస్తే ఈ దేశం ఇతర దేశాలకు ఆహారధాన్యాలను ఎగుమతి చేయగలదు. సింగపూర్‌, మలేషియా తదితర చిన్నదేశాలను ఆదర్శగా తీససుకుని ఆయా రాష్టాల్రు స్వయం సమృద్ది సాధించే ప్రణాళికలతో సాగాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ప్రజలు సంపూర్ణ సాధికారిత సాధించేలా పథకాలు అమలు కావడం లేదు. నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ఆరోగ్యం అందని ద్రాక్షగా మారింది. విద్య విలాసవస్తువుగా మారింది. ఇలాంటి అసమనాతలను రూపుమాపేందుకు పాలకులు చిత్తశుద్దితో కృషి చేయాలి. ఆనాటి పాలకుల దూరదృష్టి లోపం కారణంగా మనకు వారసత్వంగా వచ్చిన సకల అవలక్షణాలు ప్రజలను ఇంకా దరిత్రంలోనే ముంచె త్తుతున్న వేళ పాలకులు గతాన్ని నెమరేసుకుని ముందుకు సాగాల్సిన వేళ ఇది. ఇంతకాలం ఎక్కడ లోపం ఉందో గుర్తించి అవలోకనం చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. విద్యావైద్య రంగం ఎందుకు వెనక బడి ఉందో తెలుసుకోవాలి. ఆహారధన్యాలను ఇంకా ఎందుకు దిగుమతి చేసుకుంటున్నామో ఆలోచన చేయాలి. రాజకీయ దృక్కోణంలో కాకుండా అభివృద్ది కోణంలో పాలన చేయాల్సిన విషయాన్ని పాలకులు వంటబట్టించు కోవాల్సి ఉంది. ఐదేళ్లు అధికారంలోకి రాగానే మరో ఐదేళ్లు గద్దెపై ఉండడ మెలా అన్న ఆలోచన చేయడం వల్లనే భారత్‌ 75 ఏళ్ల తరవాత కూడా ఇంకా దారిద్యం, నిరక్షరాస్యత, వసతుల కొరత, ఆహారధాన్యాల కొరతతో అలమటిస్తోంది. ఇదంతా పాలకుల దృష్టి లోపంగా చూడాలి. అందువల్ల కేంద్రరాష్ట్ర సంబంధాలను కొత్తగగా నిర్వచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.