కేజ్రీవాల్కు మద్దతిచ్చే ప్రసక్తేలేదు: అజయ్ మాకెన్
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీపార్టీకి మద్దతివ్వబోమని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ స్పష్టం చేశారు. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాం కానీ కేజ్రీవాల్కు మద్దతివ్వబోమని తేల్చి చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆమ్ఆద్మీ పార్టీ అసలు రంగు బయటపడుతోందని విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతను, ప్రచార నిర్వహణను కాంగ్రెస్ అధిష్ఠానం అజయ్ మాకెన్ కు అప్పగించిన విషయం తెలిసిందే.