కేజ్రీవాల్ నివాసం ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు మంగళవారం భారీ ఆందోళన చేపట్టారు. ఆప్ ప్రభుత్వం తప్పుడు హామీలను ఇస్తోందని, ఒక్కహామీ కూడా అమలు చేయడం లేదని ఆరోపించింది. కేజ్రీవాల్ ఇంటిని ముట్టడించారు. ఢిల్లీలో 20 కొత్త కాలేజీలు ఏర్పాటు చేస్తామన్న ఆప్ సర్కార్ ఆ పని చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.