కేశంపేట పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి

రంగారెడ్డి,డిసెంబర్‌16 (జనం సాక్షి): జిల్లాలోని కేశంపేట్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ను రాష్ట్ర హోంమంత్రి శాఖ మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ దేశంలోనే షి టీమ్స్‌ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో శిథిలవాస్తకు చేరిన పోలీస్‌ స్టేషన్‌ స్థానంలో నూతన భవనాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నేరాల అదుపునకు పిడి ఆక్ట్‌ను ప్రయోగిస్తామన్నారు. షాద్‌ నగర్‌లో శిథిలావస్థకు చేరిన పోలీస్‌ క్వాటర్స్‌ను పరిశీలించి కొత్తవి ఏర్పాటు చేస్తామని హోంమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు.