కేసిఆర్‌ హయాంలోనే గ్రామాల సమగ్రాభివృద్ధి

సర్పంచ్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం

జనగామ,జనవరి19(జ‌నంసాక్షి): అభివృద్ధిని కాంక్షించే వారినే సర్పంచ్‌, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని, అప్పుడే ఆయా గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ హయాంలోనే గ్రామాలో సమగ్రాభివృద్ది జరిగిందన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాయని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమికి బుద్ధి చెప్పి తిరిగి కేసీఆర్‌ సీఎంగా చేశారని, అలాగే తనను ఎమ్మెల్యేగా రెండో సారి గెలిపించారని అన్నారు. అదే పట్టుదల, స్ఫూర్తితో టీఆర్‌ఎస్‌ బలపర్చిన సర్పంచ్‌, వార్డు సభ్యులను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆయా గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తామన్నారు. తరచూ పార్టీలు మారేవారికి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. ముప్పు అభివృద్ధికి తాను ప్రత్యేక శ్రద్ధ చూపుతానని అన్నారు. టీఆర్‌ చేపట్టి అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌, టీడీపీల నుంచి భారీగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు.