.కేసీఆర్‌ గురించి మీకేమెరుక!


`సోయి లేకుండా సీఎంపై విమర్శలు
` వ్యవసాయపొలంలో ఇళ్లుకట్టుకుంటే తప్పా?
` మానేరుతో మా అనుబంధం పెనవేసుకుంది
` భూసేకరణలో పూర్వీకుల భూములన్నీ కోల్పోయాం
` నానమ్మ, అమ్మమ్మల జ్ఞాపకార్థం పాఠశాలల నిర్మాణం
` కోనాపూర్‌లో బడి నిర్మాణానికి కెటిఆర్‌ శంకుస్థాపన
కామారెడ్డి,మే10(జనంసాక్షి):తన నానమ్మ వెంకటమ్మ గ్రామమైన కోనాపూర్‌ను ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కోనాపూర్‌ గ్రామానికి సీసీ రోడ్లు, వాటర్‌ ట్యాంక్‌, తాగునీటి కోసం 2 కిలోవిూటర్ల పైపు లైన్‌, రెండు బస్‌ షెల్టర్లు, మినీ లైబ్రరీ, మినీ డెయిరీ, మహిళా మండలి భవనం, కొన్ని కుల సంఘాల భవనాలు, గ్రామపంచాయతీకి ప్రహరీ గోడ, పశువైద్య శాల, డబుల్‌ బెడ్రూం ఇండ్లతో పాటు దళితబంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈ అంశాలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే మంజూరు చేస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. కోనాపూర్‌ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. బీబీపేట్‌కు ఒక జూనియర్‌ కాలేజీని మంజూరు చేస్తామన్నారు.నానమ్మ జ్ఞాపకార్థంగా రూ. రెండున్నర కోట్లతో నిర్మించబోయే స్కూల్‌ భవనానికి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కొంత మంది రాజకీయ నాయకులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని పట్టుకుని సోయి లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ పుట్టిన నాడే వందల ఎకరాలు ఉన్న ఇంట్లో పుట్టిండు. ఆయనకు ఆస్తులు కొత్త కాదు. పొలం మధ్యలో ఇల్లు కట్టుకుంటే ఫామ్‌ హౌజ్‌ అని పేరు పెట్టి, అడ్డగోలు ప్రచారాలు చేస్తున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి సీఎం కావడం వల్లే రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు. రూ. 50 వేల కోట్లను రైతుబంధు రూపంలో 63 లక్షల మంది రైతులకు ఇచ్చారు. రైతు ఏ కారణంగా చనిపోయినా కూడా రైతు బీమా కింద రూ. 5 లక్షలు అందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంతం మొత్తం ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతం. ఇలాంటి ప్రాంతాలకు కాళేశ్వరం ద్వారా నీరందించి సస్యశ్యామలం చేశామని కేటీఆర్‌ తెలిపారు. ఏప్రిల్‌, మే నెలల్లో మానేరు మత్తడి దుంకుతుదని అనుకోలేదు. కానీ ఇవాళ అది ఆవిష్కృతమైందని కేటీఆర్‌ పేర్కొన్నారు. మానేరు ప్రాజెక్టుకు తమ కుటుంబానికి ఏదో అనుబంధం ఉందని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. తమ పూర్వీకులు మానేరులో భూములు కోల్పోయారని అన్నారు. వారి జ్ఞాపకార్థం స్కూళ్లు నిర్మించాలని తలపెట్టానని అంటూ..ఈ అనుబంధం గురించి తెలియజేసేందుకు కేటీఆర్‌ తమ పూర్వీకుల కథ చెప్పుకొచ్చారు. నానమ్మ ఊరు అప్పర్‌ మానేరులో, అమ్మమ్మ ఊరు మిడ్‌ మానేరులో, ఇంకో అమ్మమ్మ(అమ్మ సోదరి) ఊరు కూడా లోయర్‌ మానేరులో మునిగిపోయిందని కేటీఆర్‌ గుర్తు చేశారు. నానమ్మ, అమ్మమ్మల జ్ఞాపకార్థంగా మన ఊరు` మన బడి ప్రోగ్రాం కింద తన సొంత ఖర్చులతో పాఠశాలలను నిర్మిస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడిరచారు.కామారెడ్డి జిల్లా బీబీపేట్‌ మండలం కోనాపూర్‌లో నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకర్థంగా నిర్మించే స్కూల్‌ బిల్డింగ్‌కు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ ప్రసంగించారు. పలు ఆసక్తికర విషయాలను కేటీఆర్‌ సభా వేదికగా వెల్లడిరచారు. పోసన్‌ పల్లి గురించి నానమ్మ చెప్తుంటే విన్నదే తప్ప చూసింది లేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. గతంలో పంచాయతీరాజ్‌ మంత్రిగా ఉన్నప్పుడు బీబీపేట్‌ వచ్చి ఇక్కడికి రాలేకపోయాను. బీబీపేట్‌లో సుభాస్‌ రెడ్డి పాఠశాల కట్టించినప్పుడు తాను కూడా పోసాన్‌ పల్లిలో నానమ్మ జ్ఞాపకార్థం బడి కట్టిస్తానని హావిూ ఇచ్చాను. అందులో భాగంగా మన ఊరు` మన బడి కార్యక్రమం కింద నానమ్మ, అమ్మమ్మ ఊరిలో బడులు కట్టిస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. రూ. రెండున్నర కోట్లతో నానమ్మ పేరు విూదు బడిని కడుతున్నాను. నానమ్మ ఆత్మ శాంతించాలని, ఈ ఊరికి సొంతంగా మేలు చేసిన వాళ్లం కావాలని ఈ నిర్ణయం తీసుకున్నానని కేటీఆర్‌ తెలిపారు. ఊరితో ఉండే అనుబంధాన్ని కేటీఆర్‌ పంచుకున్నారు. 80 ఏండ్లటి కింది కథ. నానమ్మది పోసాన్‌ పల్లి, తాతది సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలోని మోహినికుంట గ్రామం. అయితే నాయినమ్మ వాళ్లకు మగపిల్లలు లేరు. పెళ్లి చేసేటప్పుడే అల్లుడిని ఇల్లరికం అడిగారు. రాఘవరావు గారు ఇక్కడికే వచ్చారు. వ్యవసాయం చేసి ఇక్కడే స్థిరపడ్డారు. అప్పర్‌ మానేరు ప్రాజెక్టు అప్పటికీ కాలేదు. దాదాపు 45వ సంవత్సరం దాకా అంటే అప్పర్‌ మానేరు ప్రాజెక్టు కట్టేదాకా ఇక్కడే ఉన్నారు. నలుగురు అయిదుగురు పిల్లలను ఇక్కడే కన్నారు. ఈ చెరువు విస్తరించి మానేరు వాగు విూద అప్పర్‌ మానేరు డ్యాం కట్టాలని నిజాం నిర్ణయం తీసుకున్నప్పుడు, చెరువు విస్తరణలో వందల ఎకరాలు పోయాయి. 1940వ దశకంలో భూములను కోల్పోయారు. ఆనాటి రోజుల్లోనే భూమి కోల్పోయినందుకు రెండున్నర లక్షలు ఇచ్చింది. ఇప్పుడు ఆ విలువ కోట్ల రూపాయాల్లో ఉంటుందని కేటీఆర్‌ తెలిపారు. ఇక పోసాన్‌ పల్లి నుంచి సిద్దిపేటలోని చింతమడక గ్రామానికి తాత వెళ్లి ఐదారు వందల ఎకరాలు కొన్నారు. కేసీఆర్‌ పుట్టింది చింతమడకలోనే 1954లో జన్మించారు. మానేరు వాగుకు మాకు ఏదో అనుబంధం ఉంది. మానేరు వాగు విూద మొదట ప్రాజెక్టు కట్టినప్పుడు నానమ్మ భూములు పోయాయి. మిడ్‌ మానేరు ప్రాజెక్టు కడితే అమ్మమ్మ ఊరు కుదురుపాక మునిగిపోయింది. లోయర్‌ మానేరు డ్యాంలో ఇంకో అమ్మమ్మ(అమ్మ సోదరి) ఊరు మునిగిపోయిందని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఇవన్‌ఈన గుర్తు చేసుకున్న మంత్రికెటిఆర్‌ తన నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా స్కూల్‌ భవనాన్ని నిర్మిస్తున్నట్లు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. నానమ్మను స్మరించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం గురించి ఆలోచించడం లేదన్నారు. నా గ్రామం `నా పాఠశాల కార్యక్రమం కింద తన సొంత ఖర్చులతో పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. కామారెడ్డి జిల్లాలోని కోనాపూర్‌లో స్కూల్‌ భవనానికి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నందుకు ఆనందంగా ఉందని కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.