కొండగల్‌ పోలీసుల తీరుపై రేవంత్‌ ఫిర్యాదు

హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి కలిశారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూరులో కాంగ్రెస్‌ కార్యకర్తలనుపోలీసులు అనవసరంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తూ.. వినని వారిని కొడుతున్నారని ఎన్నికల అధికారి రేవంత్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు.