కొడుకును అమ్మేందుకు తల్లిదండ్రుల యత్నం

మహబూబ్‌నగర్: రెండు నెలల కుమారున్ని అమ్మేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని నందేనే తండాకు చెందిన వారు బాలుడిని గుర్తు తెలియని వ్యక్తికి అమ్మేందుకు సిద్ధమవ్వగా గ్రామస్తులు అడ్డుకున్నారు.దీంతో బాలుడిన వదిలివేసి తల్లిదండ్రులు పరారయ్యారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.