కొడుకును చంపిన తండ్రి
అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు
మేడ్చల్,మే18(జనంసాక్షి): జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ భగత్ సింగ్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా కన్న కొడుకును తండ్రి హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి పుల్లారావు(30) అనే వ్యక్తి తన కొడుకు వెంకటేష్ను రోకలిబండతో బలంగా తలపై బాదాడు. దీంతో వెంకటేష్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పుల్లారవును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.