కొత్తూరు ఎరువుల గోదాంలో భారీ అక్రమాలు

మహబూబ్ నగర్: కొత్తూరులోని ఎరువుల గోదాంలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. రూ. కోట్ల యూరియాను పక్కదారి పట్టించిన నలుగురు అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వారిలో సీనియర్ మేనేజర్ సూర్యశంకర్ రెడ్డి అరెస్టు కాగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.