కొనసాగుతున్న అరెస్టులు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో భారీ బందోబస్తు
25మంది అరెస్ట్‌
హైదరాబాద్‌, నవంబర్‌9(జనం సాక్షి): సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌ పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చేరుకున్న క్రమంలో వరంగల్‌కు చెందిన 25 మంది ఆర్టీసీ జేఏసీ నేతల్ని గోపాలపురం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. ‘చలో ట్యాంక్‌బండ్‌’ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లభించలేదన్న విషయం తెలిసిందే. దీంతో పోలీసులు శుక్రవారం నుంచే కార్మికులు, కార్మిక నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారు.