కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

ధర్నలతో కార్మికుల ఆందోళన
అద్దెబస్సులపై కార్మికుల మండిపాటు
ఆదిలాబాద్‌,అక్టోబర్‌28(జనం సాక్షి ): ఆర్టీసీ సమ్మె 24వ రోజు కూడా ఉధృతంగా సాగింది. ప్రజల మద్దతుతో కార్మికులు ఆందోళనకు దిగారు. ధర్నాలతో వారు డిపోల ముందు ఆందోళనకు దిగారు.  మళ్లీ అద్దె బస్సుల కోసం టెండర్‌ వేశారు. ఆర్టీసీలో కొత్తగా అ/-దదె బస్సులు తీసుకునేందుకు తిరిగి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఒకవైపు కార్మికుల సమ్మె కొనసాగుతుండగా, మరోవైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు కొనసాగిస్తోంది. ఇటీవల అ/-దదె బస్సుల టెండర్ల విషయంలో కార్మికులు ఆందో ళన వ్యక్తం చేసినా, మొదటి దఫా పక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండానే మరో దఫా టెండర్లకు సిద్ధం కావడం గమనార్హం. ఆదిలాబాద్‌ రీజియన్‌లో సమ్మె 24 రోజులుగా కొనసాగుతోంది. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులకు తాత్కాలిక డ్రైవర్లను నియమించి నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నా అవి పూర్తిస్థాయిలో సఫలం కావడంలేదు. రీజియన్‌ పరిధిలో 326 ఆర్టీసీ బస్సులను నడిపించాలని లక్ష్యం పెట్టుకున్నా కేవలం 262 బస్సులను నడిపినట్లు అధికారులే చెబుతున్నారు. అద్దె బస్సులు 172కు గాను 166 నడిపించారు.  సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు రాజకీయ ప్రతిపక్ష పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి సంఘీభావం లభించింది. ఆర్టీసీఇని ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అద్దె బస్సులను కొత్త నోటిఫికేషన్ల ద్వారా తీసుకుంటోంది. ఇది సబబు కాదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ ఉద్దేశం సరికాదు. కార్మికులు సమ్మెలో ఉన్న సమయంలో ఇలాంటి వ్యవహారాలు తగదని కార్మిక సంఘాల నేతలు అన్నారు. ప్రభుత్వ ధోరణితోనే సమస్య జఠిలమవుతోందని, సమ్మె కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు.  చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నా వ్యతిరేక వైఖరి అవలంబిస్తుందన్నారు. విలీన డిమాండ్‌ ఒక్కటే కాకుండా ఇతర డిమాండ్లు కూడా ఉన్నాయి. అవన్ని పరిష్కార యోగ్యమైనవే. కాని చర్చల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడంలేదన్నారు.
మరోవైపు  పెద్ద ఎత్తున బస్సులను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తిగల నిర్వాహకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆదిలాబాద్‌, భైంసా, మంచిర్యాల, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, ఉట్నూర్‌ డిపోల నుంచి వివిధ రూట్లలో బస్సులను నడిపేందుకు టెండర్లు పిలిచారు. ప్రభుత్వం ఈ రెండు నోటిఫికేషన్‌ల ద్వారా వందకుపైగా అద్దె బస్సులను తీసుకుంటోంది. తద్వారా ఆర్టీసీలో వీటి సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఒకవైపు సమ్మె చేస్తున్న కార్మికులు టెండర్‌ నోటిఫికేషన్‌ పక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఇవేవిూ పట్టించుకోకుండా ప్రత్యామ్నాయ చర్యలను నిరాటంకంగా కొనసాగిస్తోంది. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోవద్దంటూ కార్మికులు హెచ్చరిస్తున్నారు. సమ్మెకు ముందు ఆర్టీసీ బస్సులు రోజు 2.50 లక్షల కిలోవిూటర్లు తిరిగి సుమారు 3లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతోంది. తద్వారా ఆర్టీసీకి రోజూ రూ.75లక్షల నుంచి రూ.80లక్షల వరకు ఆదాయం లభించేది. సమ్మె తర్వాత ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యల ద్వారా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఇప్పటికీ రోజువారి ఆదాయం విషయంలో ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదన్నారు. తద్వారా నడుస్తున్న కొద్దిపాటి బస్సుల ద్వారా వస్తున్న ఆదాయం ఎటు పోతుందని ప్రశ్నించారు.