కొల్లాపూర్ ప్రజల భవిష్యత్ ముఖ్యం

మన హాయంలో చేసిన పనులు ప్రజలలోకి తీసుకెళ్లండి
జనం సాక్షి కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి 3
పెంట్లవెల్లి మండలం గోపాలపురం గ్రామం లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర సాధనకై మూడు సంవత్సరాలు అధికారాన్ని మంత్రి పదవిని వదులుకొని ఉద్యమంలోకి వచ్చి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని కొల్లాపూర్ కు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను గ్రామ గ్రామాన మనం చేసిన అభివృద్ధి కనబడుతుంది అన్నారు మన గ్రామంలో ప్రతి గడప గడపకు వెళ్లి మన ఆయంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించండి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలతో 30 సంవత్సరాల నుండి ప్రజలతో అనుబంధం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కోసం నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరినట్టు గుర్తు చేశారు.ఎమ్మెల్యేగా,మంత్రిగా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు.నాకు నా భవిష్యత్తు ముఖ్యం కాదన్న ఆయన నన్ను నమ్ముకున్న కొల్లాపూర్ ప్రజల భవిష్యత్ ముఖ్యం అని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని,రానున్న రోజుల్లో మనకు మంచి జరుగుతుందని జూపల్లి అన్నారు. జూపల్లి అంటే సేవాభావంతో కూడిన రాజకీయం చేస్తాడని చెప్పారు. కొంతమంది బెదిరింపు రాజకీయం చేస్తున్నారని, ఎవరూ భయపడొద్దని కార్యకర్తలతో అన్నారు.ఈ కార్యక్రమంలో. మాజీ ఎంపీపీ గోవింద్ గౌడ్. వైస్ ఎంపీపీ భీమ్ రెడ్డి. సింగిల్ విండో డైరెక్టర్ మహేష్.మాజీ సర్పంచ్ రాముడు. వెంకటనరసింహారెడ్డి. సుధాకర్ రెడ్డి. ఆంజనేయులు. కాటమొని వెంకటస్వామి. సుదర్శన్. శ్రీను. కృష్ణయ్య. బుచ్చారెడ్డి.రాఘవేందర్. సాయికుమార్. బాలయ్య. తదితరులు పాల్గొన్నారు