కోటమైసమ్మ పాలుతాగుతోందంటూ ప్రచారం

తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజలు
హైదరాబాద్‌,అక్టోబర్‌19(ఆర్‌ఎన్‌ఎ): శంషాబాద్‌లోని కోట మైసమ్మ ఆలయంలో అమ్మవారు పాలు తాగుతున్నారనే ప్రచారంతో శుక్రవారం గుడికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి మహాత్యం చూసేందుకు తండోపతండాలుగా భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. అమ్మవారికి పాలు తాగించేందుకు పోటీలు పడ్డారు. అమ్మవారికి స్పూనుతో పెట్టిన పాలు మాయమవు తుండటంతో… ఇది అమ్మవారి మహాత్యమేనని భక్తులు చెబుతున్నారు. అమ్మవారికి ప్రత్యేక శక్తులు ఉన్నాయని అంటున్నారు. గతంలో కూడా ఆలయం వద్ద గజ్జల శబ్దాలు వచ్చేవని చెబుతున్నారు. మరో
వైపు, అమ్మవారు పాలు తాగుతున్నారనే ప్రచారంతో… ఈ పరిసర ప్రాంతాల్లో పాల ప్యాకెట్లకు డిమాండ్‌ ఏర్పడింది. ఈ సందర్భంగా ఓ భక్తుడు మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం అమ్మవారికి ¬మం చేశామని తెలిపారు. విగ్రహాలు పాలు తాగుతాయని గతంలో విన్నామని… అమ్మవారికి కూడా పాలు తాగించాలని ఆవు పాలను తెప్పించి, స్పూన్‌ తో తాగించామని చెప్పారు. ఆశ్చర్యకరంగా అమ్మవారు పాలను తాగారని తెలిపారు.