కోర్టు ప్రాంగణంలో ఖైదీపై కాల్పులు

మధుర,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): ఓ ఖైదీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపిన ఘటన యూపిలోని మధురలోని ఛాట పట్టణంలో జరిగింది. ఓ కేసులో శిక్షననుభవిస్తున్న కర్మ్‌వీర్‌ అనే ఖైదీని పోలీసులు వ్యానులో కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్లారు. అయితే కోర్టు ప్రాంగణంలోకి వ్యాను రాగానే గుర్తు తెలియని దుండగులు అక్కడికి వచ్చి కర్మ్‌వీర్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. గాయాలతో ఉన్న కర్మ్‌వీర్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్పీ ఆదిత్యకుమార్‌ శుక్లా తెలిపారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతనిపై కక్ష పెట్టుకున్న వారు లేదా విరోధులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావస్తున్నారు.

——