క్రికెట్ టోర్నీలో గెలుపొందిన జట్టుకు బహుమతులు అందజేసిన జడ్పీటీసీ అనిల్ జాధవ్.

 

 

 

 

 

 

 

నెరడిగొండఫిబ్రవరి1(జనంసాక్షి):క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ అన్నారు.క్రికెట్ టోర్నీ ముగింపులో భాగంగా మండలంలోని బంధం రేగడి గ్రామ సర్పంచ్ గ్రామ యువకుల అభిప్రాయం మేరకు క్రికెట్ టోర్నీలో గెలుపొందిన నెరడిగొండ జట్టుకు బుధవారం నాడు జడ్పీటీసీ అనిల్ జాధవ్ తరపున మొదటి బహుమతిగా 21వెయ్యి రూపాయలు నగదు రూపంలో అందించారు.రెండవ స్థానంలో బంధం రేగడి జట్టు నిలిచింది.గెలుపొందిన జట్లకు వారి చేతుల మీదుగా అందజేశారు.యువకులు ముందుగా జడ్పీటీసీ కి శాలువతో సత్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల వలన మానసిక ఒత్తిడి తగ్గుతుందని గ్రామీణ ప్రాంతాలలో యువకులు క్రీడలలో రాణించి రాష్ట్రస్థాయి,జాతీయస్థాయిలలో గుర్తింపు పొందలని అన్నారు.జడ్పీటీసీ తోపాటు సర్పంచ్ సంఘం అధ్యక్షుడు తిరుమల గౌడ్ ఉప సర్పంచ్ దేవేందర్ సర్పంచ్లు కేంద్రే వెంకట్ రావు పాండు రంగ్ రమేష్ యువకులు నాయకులు తదితరులు ఉన్నారు.