క్రీడాలతో మానసిక ఉల్లాసం కలుగుతుంది.

 

 

 

 

 

 

– బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.ఫొటో : క్రికెట్ కిట్ అందజేస్తున్న ఎమ్మెల్యే.
బెల్లంపల్లి, ఫిబ్రవరి 1, (జనంసాక్షి )క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం ఆయన బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం మైలారం గ్రామంలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులకు క్రికెట్ కిట్, స్పోర్ట్స్ టీ షర్ట్ లను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడలపై ద్రుష్టి సారించి రాణించాలన్నారు. యువత చెడు వ్యసానాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించి గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకు రావాలన్నారు. ఈకార్యక్రమంలో కొండా లక్ష్మి, సింగల్ విండో చైర్మన్ మేకల మల్లేష్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్, మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, బీఆరెస్ పార్టీ మండల అధ్యక్షుడు పంజాల విద్యా సాగర్ గౌడ్, నాయకులు గడ్డం భీమా గౌడ్, సింగతి రాంచందర్, గురునాదం ప్రేమ్ సాగర్ గౌడ్, ఇందూరి రమేష్, కొండ అంకులు, తదితరులు పాల్గొన్నారు.