గత ఎన్నికల హావిూలను విస్మరించిన కెసిఆర్‌

ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేస్తే ఎలా?

బిజెపి కార్యదర్శి ఆచారి

మహబూబ్‌నగర్‌,నవంబర్‌27 (జనంసాక్షి) :  గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను నమ్మి ప్రజలు కేసీఆర్‌ను గెలిపిస్తే, వాటిని వమ్ము చేశారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆచారి ఆరోపించారు. ప్రజలు కెసిఆర్‌ను నమ్మి ఓటేస్తే మోసం చేసి గడీల పాలనకు తెరతీసారని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరుతామని,సమ్మె విరమించామనిచెప్పినా గడీల నుంచి బయటకు రావడం లేదన్నారు. మార్పు కోసం, మంచి భవిష్యత్‌ కోసం కెసిఆర్‌ కృషి చేస్తారని ఆశిస్తే ప్రజలను వంచించారని అన్నారు. గతంలో రాష్టాన్న్రి పాలించిన పార్టీలన్నీ అభివృద్ధిని అడ్డుకున్నాయని ఆరోపించారు. ఆయా పార్టీల పాలనలో ఈ ప్రాంత భవిష్యత్‌ కుంటుపడిందన్నారు.రజాకార్లు, మజ్లిస్‌ను ఎదుర్కొనే దమ్ము కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. ఎంఐఎంకు భయపడే టీఆర్‌ఎస్‌ సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు నమ్మి ప్రజలు కేసీఆర్‌ను గెలిపిస్తే, వాటిని వమ్ము చేశారని ఆచారి ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తామని ఇచ్చిన హావిూ ఏమైందని ప్రశ్నించారు. కనీసం భవిష్యత్‌లోనైనా చేసే సంకల్పం ఉందా అని అడిగారు. తెలంగాణ వ్యాప్తంగా 4,500మంది రైతులు

ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. తెలంగాణ తొలి,మలిదశ ఉద్యమాల్లో అమరులైన వారి కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్‌ మాటమార్చారని విమర్శించారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాలు మరచిపోయారన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ బిడ్డలపై పట్టింపు లేదని, తన కొడుకు, కూతురుకు అధికారం కట్టబెట్టడంపైనే ఉందని విమర్శించారు.