గద్దర్‌ ఇక ఖద్దర్‌ 

రాహుల్‌ పర్యటనను విజయం చేయాలని పిలుపు
హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలంగాణ  పర్యటనను గద్దర్‌
స్వాగతించారు. రాహుల్‌ పర్యటన నేపథ్యంలో ప్రజా గాయకుడు గద్దర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ పర్యటనను స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశ ప్రజలను ఏకం చేసే నినాదంతో రాహుల్‌గాంధీ ఉద్యమిస్తున్నారని, తెలంగాణలో ఆయన సభలను విజయవంతం చేయాలని గద్దర్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ మాత్రమే తెలంగాణలో దొరల పాలనను విముక్తం చేయగలదన్నారు.  ఇటీవల దిల్లీ వెళ్లిన గద్దర్‌.. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా, రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీలోనూ చేరబోననని చెప్పారు. త్యాగాలు చేసిన వారికి తెలంగాణ ఫలాలు చేరలేదని, ఫ్యూడల్‌ వ్యవస్థ నుంచి తెలంగాణను విముక్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ పార్టీపైనే ఉందని గద్దర్‌ ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇకపోతే విపక్షాలు అన్నీ ఏకమై కోరితే గజ్వెల్‌లో కెసిఆర్‌పై పోటీ చేస్తానని గద్దర్‌ ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాటు ఆయన రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తానని అన్నారు.