గవర్నర్‌తో నేడు వై.ఎస్‌. జగన్‌

5148015607d7_625x300హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు వివరించనున్నారు. ఇందుకోసం ఒక ప్రతినిధి బృందంతో మంగళవారం సాయంత్రం 4 గంటలకు రాజభవన్‌లో గవర్నర్‌ను   ఆయన కలుసుకోనున్నారు.

రూ. 500, రూ. 1000 నోట్ల రద్దుతో 40 రోజులుగా రైతులు, సామాన్యులు, చిరు వ్యాపారులు, కూలీలు క్షేత్రస్థాయిలో  పడుతున్న అగచాట్లను ఈ సందర్భంగా జగన్‌ గవర్నర్‌కు వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.