గాడిపల్లి చెరువులో పురాతన విగ్రహాలు…

వరంగల్‌:‘మిషన్‌ కాకతీయ’ పనుల్లో భాగంగా ఆదివారం నాడు గాడిపల్లి చెరువులో పూడిక తీస్తుండగా పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. వరంగల్‌ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే గాడపల్లి చెరువులో పురాతన విగ్రహాలు బయల్పడటంతో ఆ విగ్రహాలకు చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అధికారులు చెరువులో మిషన్‌ కాకతీయ పనులను నిలిపివేశారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పురావస్తు శాఖ అధికారులు అక్కడికి చేరుకుని విగ్రహాలను పరిశీలించారు.