గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో ఓ రిమాండ్ ఖైదీ మృతిచెందాడు గుండెనొప్పితో చికిత్స పొందుతున్నరిమాండ్ ఖైదీ మంగళవారం అర్థరాత్రి చనిపోయాడు. ఓ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నల్లగుంట శేఖర్(23)కు గుండె నొప్పి రావడంతో సోమవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి దాటాక మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బుధవారం బంధువులకు అప్పగించారు. మృతుడు బుజబుజనెల్లూరుకు చెందినవాడు.