గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడి

ఖానాపూర్: వరంగల్ జిల్లాలో గుడుంబా స్థావరాలపై ఆదివారం ఉదయం ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. ఖానాపూర్ మండలం నాజీతాండాలో అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి 10 క్వింటాళ్ల బెల్లం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడులతో గుడుంబా తయారీదారులు పరారయ్యారు. అక్రమార్కులపై కేసులు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.