గుణలో జ్యోతిరాదిత్య నామినేషన్‌

భోపాల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ యువనేత జ్యోతిరాధిత్య సింధియా శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్‌  లోని గుణ లోక్‌సభ సిట్టింగ్‌ స్థానం నుంచి మరోమారు నామినేషన్‌ దాఖలుచేశారు. సింధియాకు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి కేపీ యాదవ్‌ బరిలో ఉన్నారు. మే పన్నెండవ తేదీన పోలింగ్‌ జరుగనుండగా,మే 23న ఎన్నికల ఫలితాలు విడుదలౌతాయి. గత ఎన్‌ఇనకల్లో కూడా సింధియా ఇక్కడి నుంచే విజయం సాధించారు.