గుప్తనిధుల కోసం తవ్వకాలు
రంగారెడ్డి,అక్టోబర్30(జనంసాక్షి): చేవెళ్ల మండలంలోని తులసి వాటర్ ప్లంట్ వెనుక అతి పురాతనమయిన దర్గా దగ్గర రాత్రి 12 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి గుప్త నిధుల తవ్వకాలు జరిపారు అక్కడ పెద్ద,పెద్ద శబ్దాలు వినపడడంతో స్థానికులు అప్రమత్తమయి, పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీస్లని చూసి పారిపోయారు. ఒక మోటర్ సైకిల్ ని వదిలేసి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు వివరాలు సేకరిస్తున్నారు. గుప్త నిధుల త్రవ్వకాలు జరిపిన స్థలంలో నిమ్మకాయలు, తమలపాకులు,కుంకుమపసులు చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు..