గురుకుల జూనియర్‌ అడ్మిషన్లు మొదలు

వెల్లడిరచిన అధికారులు
హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల పక్రియ ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ఈనెల 14న మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలతో పాటు సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాల్లోనూ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. కాగా విద్యార్ధుల పరీక్షా ఫలితాను సంస్ధ వెబ్‌సైట్‌లో ఉంచడం జరిగిందని,
ఈనెల 27వ తేదీ నుంచి విద్యార్ధులు ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి సిహెచ్‌ రమణ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్ధులకు కేటాయించిన కళాశాలల్లో ఈనెల 30వ తేదీన కులము, సర్టిఫికెట్స్‌తో సంప్రదించాలని కోరారు.