గొర్రెల కాపరులకు 5 ఎకరాలు కేటాయించాలి 

ఆసిఫాబాద్‌,జనవరి9(జ‌నంసాక్షి ): గొర్రెలు, మేకల కాపరులకు మేత కోసం అడవిలో 5 ఎకరాల భూమి కేటాయించాలని టిడిపి నేత,యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు యాదవ్‌ సూచించారు. రాజకీయంగా బలపడితే హక్కుల రక్షణతో పాటు ప్రత్యేకంగా నిధులు పొంది కులస్థుల అభ్యున్నతికి పాటుపడవచ్చన్నారు.అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలంటే పిల్లల చదువులపై ప్రత్యేకదృష్టి పెట్టాలని  సంఘపటిష్టతకు సమష్టితత్వం ముఖ్యమని, అందుకు పార్టీలకతీతంగా పాటుపడాలని పిలుపునిచ్చారు.  ప్రమాద బీమా కింద రూ.5 లక్షల నష్ట పరిహారం, యాదవుల అభ్యున్నతికి ప్రత్యేక నిధుల కేటాయింపు చేయాలని విజ్ఞప్తి చేశారు.