గొర్రెల మందపై కుక్కల దాడి

మహబూబ్‌నగర్(జ‌నం సాక్షి) : మక్తల్ మండలం కర్ని గ్రామంలో కుక్కలు రెచ్చిపోయాయి. కుర్వ నర్సప్పకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో 21 గొర్రె పిల్లలు మృతి చెందాయి. గొర్రెల యజమాని నర్సప్ప తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని నర్సప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. కుక్కలను నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు.