గోదాదేవి కల్యాణోత్సవంలో పాల్గొన్న

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి దంపతులు

సూర్యపేట,జనవరి14(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి సమేత శ్రీనివాస కల్యాణ మ¬త్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి కుటుంబసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణ మ¬త్సవం సందర్భంగా జగదీష్‌రెడ్డి-సునీత దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు వేదపండితులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. భక్తులు తరలిరావడంతో కన్నుల పండువగా శ్రీగోదాదేవి శ్రీనివాస కల్యాణ వేడుక జరిపించారు.