గోదావరిఖనిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన

పెద్దపల్లి,సెప్టెంబర్‌30  జనంసాక్షి  :  జిల్లాలోని గోదావరిఖనిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం.. పాలకుల నిర్లక్ష్యంవల్ల అభివృద్ధి చెందడం లేదని విమర్శించారు. పరిశ్రమలు కాపాడి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. రామగుండం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కిషన్‌రెడ్డి సూచించారు.