గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధిచేస్తాం
– కేసీఆర్ చింతమడకకే గౌరవం తెచ్చారు
– గ్రామంలో ప్రతీ ఒక్కరికి ఇల్లు, ఉపాధి కల్పిస్తాం
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్ధిపేట, జులై22((జనంసాక్షి):) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రాకతో చింతలేని గ్రామంగా చింతమడక మారుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చింతమడక పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు ప్రసంగించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్కు చింతమడక బాసటగా నిలిచింది. ఆమరణ దీక్ష సమయంలో చింతమడకలో ఒక్క ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. ఉద్యమంలో విూరంతా కేసీఆర్ను వెన్నంటి ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకతో చింతమడకలో దసరా, దీపావళి, బతుకమ్మ ఒకేసారి వచ్చినట్లుందని హరీశ్రావు అన్నారు. ఆయన రాకతో చింతలేని గ్రామంగా చింతమడక మారుతుందని చెప్పారు. తెలంగాణ సాధన ఉద్యమంలో కేసీఆర్కు చింతమడక బాసటగా నిలిచిందని, ఆమరణ దీక్ష సమయంలో ఆ ఊరిలో ఒక్క ఇంట్లోనూ పొయ్యి వెలగలేదన్నారు. చింతమడక వాసులతో ఆత్మీయానురాగాలు పంచుకొనేందుకే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చారని, చింతమడక బిడ్డ ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారంచేసి తెలంగాణ గర్వించేలా చేశారన్నారు. ఎవరైనా ఊరుపేరుతో గౌరవం పొందుతారు కానీ.. కేసీఆర్ చింతమడకకే గౌరవం తెచ్చారని కొనియాడారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని, ఇల్లులేని వారికి ఇంటి నిర్మాణం చేయిస్తామని, చింతమడక పరిసర గ్రామాలకు రహదారులు కావాలని విజ్ఞప్తులు అందాయని, గ్రామంలో అభివృద్ధి కోసం రూ.10 కోట్లు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని అన్నిగ్రామాలకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాం. సిద్దిపేట పట్టణంలో మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరుతున్నానని, దేశం మొత్తానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని హరీశ్రావు అన్నారు.