గ్రామాభివృద్దికి పాటు పడాలి: ఎమ్మెల్యే

జనగామ,జనవరి23(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ప్రజల మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లో గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని పాలకు ర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కెసిఆర్‌ లక్ష్యం మేరకు పథకాలను గ్రామస్థాయికి తీసుకుని వెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉందని, విజయం సాధించి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తొలివిడత గెలిచిన సర్పంచ్‌, వార్డు సబ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. రెండో,మూడో విడతలో బరిలో ఉన్న సర్పంచ్‌ అభ్యర్థులు ప్రభుత్వ పథకాలను గడప గడపకూ వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.