ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

ఖమ్మం,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులను సన్మానించి గౌరవాన్ని చాటారు. అలాగే ప్రబుత్వ పరంగా కలెక్టర్‌ వారిని సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయులను అవార్డులతో సత్కరించారు. చింతకాని మండలంలోని పలు పాఠశాలల్లో స్వయం పాలనా దినోత్సవం బుధవారం నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయ వేషధారణలో తరగతులను బోధించారు. విద్యార్థుల బోధన, వారి వేషధారణలు ఆకట్టుకున్నాయి. మండలంలోని నాగులవంచ, చింతకాని, ప్రొద్దుటూరు, పాతర్లపాడు గ్రామాల్లోని పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొంది.