ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం 

కొత్తగూడెం,మార్చి29(జ‌నంసాక్షి):  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం అశ్వారావుపేటలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్‌ కూడలిలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆస్పత్రిలోని రోగులకు పండ్లు అందజేశారు. అనంతరం మండల ఉపాధ్యక్షుడు ఎం.రాజమోహన్‌రెడ్డి పేద ప్రజలకోసం ఎన్టీఆర్‌ చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కె.స్వామి, ఎన్‌.శ్రీను, ఎ.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.